- చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి.
కోరుట్ల, ముద్ర విలేకరి: భారతీయ జనతా పార్టీ కథలాపూర్ మండల శాఖ ఆధ్వర్యంలో బక్రీద్ పండగ సందర్బంగా అక్రమంగా గోవులను తరలించకుండా ఉండేలా మండలంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలనీ కోరుతూ శనివారం రోజు బీజేపీ మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏఎస్సైకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాంధారి శ్రీనివాస్, కాసోజీ ప్రతాప్, కథలాపూర్ మహేష్, నరెడ్ల రవి, గడ్డం జీవన్ రెడ్డి, మల్యాల శ్రీకర్, సాంతారం, గంగమల్లయ్య పాల్గొన్నారు.