రామకృష్ణాపూర్, ముద్ర : సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 8 న హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా నిర్వహించే ప్రజా ధర్నాను జయప్రదం చేయాలని కోల్ బెల్ట్ డివిజన్ కమిటీ సభ్యులు గజ్జి మల్లేష్ కోరారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు.తక్షణమే ఆపరేషన్ కంగార్ నిలిపివేయాలంటూ డిమాండ్ చేశారు.వెంకటేష్,అప్పారావు,శ్రీనివాస్,నాగరాజు,సత్యం తదితరులు పాల్గొన్నారు.