ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: భద్రాచలంలో గుండె పోటుకు గురైన ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు.శుక్రవారం మంత్రి తుమ్మల పర్యటనలో పార్టీ కార్యకర్త తోటమల్ల సుధాకర్ అస్వస్థతకు గురైయ్యాడు. అక్కడే వున్న తెల్లం వెంకట్రావు వైద్యుడు కావడంతో, వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాపాయం నుండి రక్షించారు. తెల్లం సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడడాన్ని పలువురు అభినందించారు.