Take a fresh look at your lifestyle.

కూల్చాల్సిన అవసరం మాకు లేదు

  • ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం పెరిగింది.
  • తాము ఏదో కుట్ర చేసి కుయుక్తి రాజకీయాలు చేయాల్సి ఖర్మ లేదు.
  • రేవంత్​ ప్రభుత్వాన్ని కాపాడుతుందే బీజేపీ.
  • అత్మాభిమానం లేని సీఎం రేవంత్​.
  • బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్.
ముద్ర, తెలంగాణ బ్యూరో: రేవంత్ సర్కార్ ను కూల్చాల్సిన అవసరం మాకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన ఎజెండా మాకు లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరు పడగొట్టాల్సిన అవసరం లేదని..ప్రజల్లోనే తిరుగుబాటు వచ్చి కూలిపోతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండాలి..రేవంత్ రెడ్డి నే ముఖ్యమంత్రిగా ఉండాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. అప్పుడే మరో 20 ఏళ్ల వరకు ప్రజలు ఎవరు కాంగ్రెస్ కు ఓటు వేయరన్నారు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలను  ప్రజలు మట్టిలో కలిపిన ఘటనలు చరిత్రలో చాలానే ఉన్నాయన్నారు. అయితే రాష్ట్రంలోని  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని సంచలన  ప్రకటన చేశారు.మా   పార్టీ ఎంఎల్ఎ కొత్త ప్రబాకర్ రెడ్డి చెప్పింది అక్షర సత్యమన్నారు.చందాలు వసూలు చేసుకొని అయినా డబ్బులు ఇస్తాం.ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చాలా మంది అనుకుంటున్నారన్నారు. పరిస్థితిని చూస్తుంటే  మరెన్నో రోజులు కాంగ్రెస్ ను భరించే పరిస్థితి లేదని అన్నారు.విదేశాల్లో తిరుగుబాటు వచ్చినట్టు తెలంగాణలో కూడా తిరుగుబాటు వస్తుందని ప్రజలే తరిమేస్తారని హెచ్చరించారు. దేశంలో ఆయా రామ్ గయా రాం  ఫిరాయింపుల సంస్కృతిని తీసుకువచ్చిందే  కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అప్పటి నుంచే రాజకీయ విలువలు పడిపోతున్నాయని మండిపడ్డారు.అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికైనా దిగజారుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.2004లో కాంగ్రెస్ తో కలిసి తాము పోటీ చేస్తే..గెలిచిన 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్లలో  పది మందిని కాంగ్రెస్ పార్టీ గుంజుకుందన్నారు.మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ గుంజుకుందన్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.గురువారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, రియాల్టర్ల సహకారంతో రేవంత్ సర్కార్ ను కూల్చుతున్నామన్న ప్రచారాన్ని  ఖండించారు.తాము ఏదో కుట్రప చేసి,కుయుక్తి రాజకీయాలు చేయాల్సిన ఖర్మ పట్టలేదన్నారు.ప్రజలు ఇచ్చిన తీర్పుర కట్టుబడి ఉంటామే తప్ప..దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కోరుకోవడం లేదన్నారు.అలాంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. కాంగ్రెస్ లోనే గ్రూపు రాజకీయాలు మొదలు పెట్టి వారి ప్రభుత్వాన్ని వారే కూల్చుకుంటే తప్ప..బీఆర్ఎస్  మాత్రం అంత నీచానికి దిగజారదని స్పష్టం చేశారు.
  • రేవంత్ కు సిగ్గు లేదు…
అధికారం మదంతో అహంకారంతో ఎవరైనా విర్రవీగుతూ నియంతలం,చక్రవర్తులం, రారాజులం అని ఏ రాజకీయ నాయకుడైనా భావిస్తే..దానికి ప్రజాస్వామ్యంలో  తావుండదన్నారు. ప్రజాస్వామ్యానికి మూలమైన నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని గమనిస్తూనే ఉంటుందన్నారు.సరైన సమయంలో సరైన పద్ధతుల్లో స్పందిస్తుందని కేటీఆర్ అన్నారు.ఇందుకు  రెండు రోజుల క్రితం  సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి  నేతృత్వంలో జరిగిన వాదోపవాదాలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగిందన్నారు.
హెచ్.సి.యూ లోని 100 ఎకరాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? ఎట్లా పునరుద్ధరిస్తారో స్పష్టమైన రోడ్డు మ్యాప్ తో రాకుంటే అదే స్థలంలో తాత్కాలిక జైలు ఏర్పాటు చేసి అధికారులను జైలుకు పంపుతాం అని సుప్రీంకోర్టు చెప్పడం ఇంతకు ముందెన్నడూ జరగలేదన్నారు.ఒక ముఖ్యమంత్రిని ఈ స్థాయిలో  సుప్రీం కోర్టు చివాట్లను పెట్టిన దాఖలాలు లేవన్నారు. ఆత్మాభిమానం, పౌరుషం, సిగ్గు ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవారన్నారు. కానీ అక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి. ఆయనకు సిగ్గు, శరం, ఆత్మాభిమానం ఏమీ లేవన్నారు.ఎన్ని విమర్శలు వచ్చినా అన్నింటిని దులుపుకొని బతుకుతున్నాడని మండిపడ్డారు.హెచ్.సి.యు భూముల తనఖా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందన్న బీఆర్ఎస్ ఆరోపణలకు బలం చేకూరేలా సెంట్రల్ ఎంపవర్ కమిటీ సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందన్నారు.ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్థలమే అని ఎంపవర్ కమిటీ తేల్చి చెప్పిందన్నారు. యూనివర్సిటీలో  జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకమైన అరాచకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎంపవర్ కమిటీ సూచించిందన్నారు. ఈ విషయంలో ఆర్బిఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సిబిఐ, సివిసి  జోక్యం చేసుకోవాలని కొన్ని రోజుల క్రితం తాను కూడా విజ్ఞప్తి చేశానని..తమ వాదన నిజమే అని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదికతో స్పష్టమైందన్నారు.
  • కేంద్రం ఎందుకు స్పందించదు.
సెంట్రల్ యూనివర్సిటీ లో వేలాది చెట్లను నరికేశారని అక్కడ ఉన్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని, బడా ఆర్థిక మోసం జరిగిందని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని  కేటీఆర్ ప్రశ్నించారు. హెచ్ సియూ భూముల్లో అర్ధరాత్రి బుల్‌డోజర్‌లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని ప్రవచనాలు చెప్పిన మోడీ, రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి ఎందుకు ఆరాటపడుతున్నారని నిలదీశారు.కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే కేంద్ర సంస్థలతో రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరపాలని  డిమాండ్ చేశారు.ఆనాడు సిబిఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే..ఈనాడు ఈడిని బిజెపి విచ్చలవిడిగా వాడుతుందని విమర్శించారు.ప్రధాని నరేంద్ర మోడీ సంవత్సరానికి ఒకసారి మాట్లాడుతారన్నారు.తెలంగాణలో రాహుల్ రేవంత్ టాక్స్ వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని సరిగ్గా సంవత్సరం కిందట 2024 ఏప్రిల్ లో మోడీ ఆరోపించారన్నారు.మోడీ అన్న మాటలకు వార్షికోత్సవం కూడా అయిపయినా..ఎందుకు విచారణ లేదని ప్రశ్నించారు. మళ్లీ సంవత్సరానికి నిద్ర నుంచి మేల్కొన్న మోడీ మళ్ళీ రెండు రోజుల క్రితం మాట్లాడిండన్నారు.సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగంచేస్తుందని హరియాణాలో ప్రవచనాలు చెప్పిండని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను నిజంగానే ఆపాలని మోడీ అనుకుంటే సెంట్రల్ ఎంపవర్ కమిటీనివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు?  అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని దర్యాప్తు సంస్థలకు ఉత్తరాలు కూడా రాశామన్నారు. మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని తెలంగాణ ప్రజలు భావించాల్సి వస్తుందన్నారు.  పర్యావరణ పరిరక్షణ పట్ల బీజేపీకి ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేదా ఆర్.బి.ఐ, సివిసి, సిబిఐ తో పాటు కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాలన్నారు.  యూనివర్సిటీ భూములపై మోడీ డైలాగులు కొడితే సరిపోదని కేటీఆర్ అన్నారు. ఆ భూములపై బిజెపి స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీ తో పాటు, బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆందోళనలు చేశారు అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? అని ప్రశ్నించారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి మోడీ ఎందుకు ఆరాటపడుతున్నారు? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం  కొద్ది రోజులు ఓపికగా ఎదురు చూస్తామన్నారు.ఈ నెల  27 తర్వాత మరోసారి కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ ప్రతినిధులం వెళతాం ఆధారాలను అందిస్తామన్నారు. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బిజెపిని ఎండగడతామన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతుంది బిజెపినే అని ప్రజలకి చెబుతామని స్పష్టం చేశారు.
  • రాహుల్ గాంధీ ఎక్కడ?
రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చిన రాహుల్ గాంధీ ఇక్కడి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడతానని చెప్పాడు.కానీ ఇప్పుడు ఇంత జరుగుతుంటే రాహుల్ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.పల్లెతో మాట కూడా మాట్లాడడంలేదు.ఢిల్లీకి రేవంత్ రెడ్డి పంపుతున్న నోట్ల కట్టాలతోనే రాహుల్ గాంధీ నోరు తెరవడం లేదు.మరి బిజెపికి ఏం అడ్డం వస్తుంది? మోడీ ఎందుకు మాట్లాడటం లేదు.? వేలాది చెట్లను నరికేశారని అక్కడ ఉన్న జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు.? రాష్ట్ర ప్రభుత్వం టిఎస్ఐఐసి ఉద్దేశాల మీద తమకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయని సెంట్రల్ ఎంపవర్ కమిటీ తన నివేదికలో స్పష్టం చేసింది.1974, 1981, 2006 పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ టీఎస్ ఐఐసీ ఉద్దేశపూర్వకంగానే అక్కడి చెట్లను నరికి వేసింది.ఎన్నో డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదే అని ఎంపవర్ కమిటీ తేల్చింది.ఆ భూమికి హెచ్సీయూ లీగల్ ఓనర్ అని నివేదికలో పొందుపరిచింది.
  • ప్రైవేటు సైన్యంలా కొంతమంది పోలీసులు.
రాష్ట్ర  పోలీసులలోని కొంతమంది రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఆ కొంతమందికి కూడా ఇదే హెచ్చరిక అని అన్నారు.మిమ్మల్ని కూడా వదిలిపెట్టమని హెచ్చరించారు. మీ మీద కూడా సుప్రీంకోర్టుకి వెలతామన్నారు.ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు

Leave A Reply

Your email address will not be published.