Take a fresh look at your lifestyle.

గల్ఫ్ లో పోసానిపేట చెందిన వ్యక్తి దారుణ హత్య

ముద్ర,కోరుట్ల/కథలపూర్ : అద్దె రూం విషయంలో ఇద్దరి స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఒక వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. గల్ఫ్ కార్మికుల సమాచారం మేరకు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామానికి చెందిన గుంట హనుమంతు 41 అనే వ్యక్తి బతుకుదెరువు కోసం సౌదీలోని జుబెల్ లో పని చేసుకుంటూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు.అయితే శుక్రవారం రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు రూమ్మేట్స్ మధ్య తలెత్తిన వివాదం లో హనుమంతు వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది.హత్య చేసిన నిందితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.హనుమంతు మృతితో పోసానిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య కూతురు కొడుకు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.