ముద్ర ప్రతినిధి, కామారెడ్డి: చదువుతో పాటు విద్యార్థులకు ఫిజికల్ ఫిట్నెస్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.శుక్రవారం రాత్రి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయం 6 గంటలకు యోగా చేస్తున్న విద్యార్థులతో పాటు కలెక్టర్ పాల్గొన్నారు.ప్రతీ రోజూ విద్యార్థులకు యోగా,వివిధ గేమ్స్ ఆడించాలని సూచించారు.అనంతరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులకు ఐఐటి ఆన్లైన్ తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడారు.ఆన్లైన్ తరగతులు ఎంతగానో ఉపయోగపడతాయని,ఐఐటి లో సీటు సాధించాలని అన్నారు.కలెక్టర్ తో పాటు ప్రిన్సిపాల్ రఘు యున్నారు.
- పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్
బిక్కునూర్ లో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించి,ప్రతీ రోజూ గ్రామంలోని చెత్తను సేకరించాలని, అదేవిధంగా ఇంటింటి చెత్తను తడి పొడి విడివిడిగా సేకరించాలని,సేకరించిన చెత్తను డంపింగ్ యార్డ్ కు తరలించాలని,ముఖ్యంగా జాతీయ రహదారి వెంబడి ఉన్న డాబా హోటల్ వద్ద చెత్తను తొలగించాలని తెలిపారు.పల్లె ప్రకృతి వనం ను పరిశీలించి వేసవి దృష్ట్యా చెట్లకు నీళ్ళు పొయాలని తెలిపారు.అనంతరం రోడ్డు ప్రకటన ఉన్న చెట్లకు కలెక్టర్ నీళ్ళు పోశారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివ ప్రసాద్,ఎంపీడీఓ రాజ్ కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
- నిరంతరంగా పారిశుద్ధ్య పనులు : కలెక్టర్
పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.శనివారం ఉదయం పట్టణంలోని హైదరాబాద్ రోడ్,నిజాంసాగర్ రోడ్ ప్రాంతాలలో మున్సిపల్ కార్మికులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు.పట్టణంలో నిరంతర పారిశుధ్య పనులు నిర్వహించాలని,మురికి కాల్వలలో ఉన్న చెత్తను తొలగించాలని తెలిపారు.రోడ్డుకు ఇరువైపులా ఉన్న మొక్కలు,చెట్లకు ప్రతీ రోజూ నీటిని ఫోయాలని తెలిపారు. అక్కడే ఉన్న పబ్లిక్ టాయిలెట్ ను కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా హౌసింగ్ బోర్డు వాకర్స్ కలెక్టర్ ను కలిసి హౌసింగ్ బోర్డు కాలనీ ని సందర్శించాలని,మొక్కలకు అవసరమైన నీటి సరఫరాకు బోర్ ను మరమ్మతు చేయించాలని కోరారు.ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమీషనర్ రాజేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.