కోరుట్ల/కథలాపూర్, ముద్ర: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రోజు మండల అధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో, కథలాపూర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో పార్టీ క్రియాశీల సభ్యుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ఇంచార్జ్ గా రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్ విచ్చేసారు.ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, క్రియాశీల సభ్యులు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన విషయాల్నింటిని క్లుప్తంగా కార్యకర్తలకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వర్రావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు కథలాపూర్ మహేష్, పిడుగు ఆనంద్ రెడ్డి, నరెడ్ల రవి, దయ్యా లక్ష్మి నర్సయ్య, జిల్లా సత్యం, అల్లకొండ నవీన్, పాలేపు, రాజేష్, నరేష్, గంగామల్లయ్య, శ్రీధర్, శివ, వినయ్, నరేందర్, మహేష్, సంతారం, సాయిరెడ్డి, వినయ్, రాజేష్, రాజరెడ్డి శ్రీకాంత్ పాల్గొన్నారు.