కోరుట్ల/కథలాపూర్, ముద్ర: కథలాపూర్ మండల భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు మల్యాల మారుతి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా మండల కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో బీజేపీ అతిపెద్ద రాజకీయ పార్టీ అని, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో, స్థానిక సంస్థ ఎన్నికల్లో బీజేపీ విజయ దుందుభి మొగిస్తుందని, దిన దిన అభివృద్ధిగా దేశం మొత్తం కాషాయామయం అవుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపేల్లి గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు రాచమడుగు వెంకటేశ్వరరావు, పిడుగు ఆనంద్ రెడ్డి, అల్లూరి బాపు రెడ్డి, నరెడ్ల రవి, గడ్డం జీవన్ రెడ్డి, జిల్లా సత్యం, మ్యాకల రాజేష్, దయ్యా లక్ష్మీ నర్సయ్య, గంగాధర్, రాజారెడ్డి, మహేష్,శ్రీకర్, గణేష్ శ్రీకాంత్ ప్రణీత్, శివకుమార్, మహేష్, గణేష్, గంగమల్లయ్య, కిషోర్, రాజశేఖర్, గణేష్, రాజేష్, మధు తదితరులు పాల్గొన్నారు.