ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ, ఎయిమ్స్ బీబీనగర్ సంయుక్త ఆధ్వర్యంలో 4న అంతర్జాతీయ కాన్సర్ దినోత్సవం సందర్బంగా శనివారం కోర్టు ఆవరణలో కాన్సర్ వ్యాది ముందస్తుగా గుర్తింపు, నివారణ, చికిత్స అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణ రమావత్, ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోదిని, డాక్టర్ మానిష్ లు కాన్సర్ వ్యాదిపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. మాధవి లత మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సంబంధిత స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని వ్యాది లక్షణాలు ఏమైనా గుర్తిస్తే సత్వర వైద్య చికిత్స చేయించుకోవాలని, ఆశ్రద్ద అనేక నష్టలకు దారితీస్తుందని తెలిపారు. పని చేసే చోట మహిళల ఉద్యోగులు, ఇతర సిబ్బంది వారిపై లైంగిక వేధింపుల చట్టం, శిక్షలు అంశాలపై అవగాహన కల్పించారు. కోర్టుకు దివ్యంగులు, వృద్దులు ఎంతో మంది వస్తుంటారని వీరికి వెసులుబాటుగా ఉండేందుకు భువనగిరి న్యాయవాది, పూర్వ రోటరీ క్లబ్ అధ్యక్షులు పి. లింగారెడ్డి రెండు వీల్ చైర్లను డొనేట్ చేశారని తెలిపి వారి ధాత్రుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి ఉషశ్రీ, అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎన్. శ్యాంసుందర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి. కవిత, భువనగిరి న్యాయ వాదుల సంఘం అధ్యక్షులు బి. హరినాథ్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎస్. జైపాల్, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. శంకర్, న్యాయవాదులు, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లు, భువనగిరి జిల్లా కోర్టు ఎ. ఒ రాంకోటి, అదనపు జిల్లా కోర్టు ఎ. ఒ రాఘవ రావు సిబ్బంది పాల్గొన్నారు.