రూ.100 కోట్ల తో ఆలయ పునర్నిర్మణానికి శంఖుస్థాపన
రూ.200 కోట్ల తో ఇంటిగ్రెటెడ్ స్కూల్ కు భూమి పూజ
ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏప్రిల్ 6 న ఉదయం 11 గంటలకు బాసరకు రానున్నారని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. బాసర లో మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ముధోల్ లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు.