Take a fresh look at your lifestyle.

ప్రజావాణి దరఖాస్తులకు సత్వర పరిష్కారం… అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

(ముద్ర ప్రతినిధి, ఉమ్మడి రంగారెడ్డి) : ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్  సి. నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీతలతో కలసి  స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ  పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ – 41, ఇతర శాఖలకు – 23, మొత్తం 64 దరఖస్తులు అందాయి.

Leave A Reply

Your email address will not be published.