ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
పట్టణంలోని 25వ వార్డ్ కౌన్సిలర్ బెండలాల్ రాజ్ బెండస్వరూపల కుమారుడు సిద్ధార్థ వివాహం బుధవారం నాగారంలో జరగగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హీరే కార్ శ్రీను హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా గిరీష్ కుమార్ గౌడ్, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ ముదిరాజ్, నాయకులు బోయిని బాలయ్య, నరసింహ, మహేష్, సిద్ధులు, గోపే ఎల్లయ్య పాల్గొన్నారు.