మాదాపూర్, మద్ర: శేరిలింగంపల్లి లోని గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో టీపిసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ పలువురు ప్రముఖులతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని కరాటేలో గెలుపొందిన వారికీ మెడల్స్, అవార్డులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ యాదవ్ తెలంగాణ కరాటే అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.