ముద్ర, యాదగిరిగుట్ట :
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఉంజల్ సేవ ఆలయ అర్చకులు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ఉదయం అభిషేకం సాయంత్రం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి ఉంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఉంజల్ సేవను ఆలయ పురవీధులలో ఊరేగించి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ నిత్య రాబడి లో భాగంగా శుక్రవారం రోజున రూ.11,45,649 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, కిరణ్ కుమార్ చార్యులు మురళి కుమార్ చార్యులు,ఇన్చార్జి చంద్రమౌళి, కొమ్మ గాని కుమార్ ఎస్పీఎఫ్ సిబ్బంది పాండు మురళి భక్తులు పాల్గొన్నారు.