రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియూ) నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం స్థానిక సివిల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు.అనంతరం సూపర్వైజర్ సమ్రాన్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. మల్లేష్,శంకర్,శేఖర్,మల్లన్న,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.