రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆటో డ్రైవర్ గోగర్ల భీమయ్య కుటుంబానికి ఆటో యూనియన్ సభ్యులు చేయూతనందించారు.శుక్రవారం భీమయ్య దశ దిన కర్మ సందర్భంగా పది వేల రూపాయలను యూనియన్ గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షుడు సంపత్, ఉపాధ్యక్షుడు అంజయ్య మృతుని భార్యకు అందించారు.