ముద్ర, మల్యాల: మండలంలోని సర్వాపూర్ గ్రామానికి చెందిన ఆకుల లక్ష్మి అనారోగ్యంతో మృతి సోమవారం మృతి చెందింది. విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దహన సంస్కారాల కోసం వారి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించగా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్ అందించారు. ఆయన వెంట శనిగారపు తిరుపతి, కటకం వినయ్, కొట్టపల్లి బాబు, పున్నం సాయి తదితరులు ఉన్నారు.