పూజా కార్యక్రమంలో కార్తీక్ రెడ్డి
ముద్ర, బండ్లగూడ:గండిపేటలోని శివాలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు బుధవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కార్తీక్ రెడ్డి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, స్వయంగా వడ్డనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కార్తీక్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు
నార్సింగి సర్కిల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్ రెడ్డి
గండిపేట మాజీ సర్పంచ్ ప్రశాంత్ యాదవ్
మైనారిటీ విభాగం అధ్యక్షుడు ముక్తార్
మాజీ సర్పంచ్ నరసింహ
వీరితో పాటు హరిశంకర్, గణేష్ ముదిరాజ్, మల్లేష్, సుధాకర్, శ్రీకాంత్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.