Take a fresh look at your lifestyle.

ఉద్యోగులు,పెన్షర్లకు సర్కారు తీపి కబురు

  • పెండింగ్ లో ఉన్న రూ. 180.38 కోట్ల మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్.
  • గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులను సైతం క్లియర్ చేసిన డిప్యూటీ సీఎం.

ముద్ర, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్ మెంట్ పెండింగ్ బిల్లుల మొత్తం రూ. 180.38 కోట్లు నిధులను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క  ఒకేసారి విడుదల చేశారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, లెక్కకు మించిన సంక్షేమ పథకాలు మరోవైపు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులకు ప్రాధాన్యత ఇస్తూ డిప్యూటీ సీఎం వాటిని క్లియర్ చేశారు.గత ప్రభుత్వం కాలం లో 04- 03- 2023 నుంచి 20-06-2025  వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం క్లియర్ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో 26,519 మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలిగింది.

Leave A Reply

Your email address will not be published.