హైదరాబాద్ ముద్ర కూకట్పల్లి ఫిబ్రవరి 15:
కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్స్లో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను కూకట్పల్లి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి కాంగ్రెస్ ఇంచార్జ్, పీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.గిరిజనుల ఐక్యత, అభివృద్ధి కోసం సేవాలాల్ మహారాజ్ చేసిన కృషి చిరస్మరణీయమని బండి రమేష్ కొనియాడారు. అమృతనగర్ తాండాలో తానే స్వయంగా పర్యటించి, అక్కడి సమస్యలను గుర్తించి 62 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు.త్వరలోనే ఒక కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన శేరి సతీష్ రెడ్డిని బండి రమేష్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సేవాలాల్ మహారాజ్ భక్తులు మరియు గిరిజన ప్రజలు పాల్గొన్నారు.