ముద్ర, హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మరో క్రికెటర్ సత్తా చాటుతున్నాడు. ఎల్బీనగర్ వాసి రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024 .. 25 సీజన్లో అరుణాచల్ ప్రదేశ్ అండర్–23 క్రికెట్ టీమ్కు ఎంపికయ్యాడు.
బీసీసీఐ మెన్స్ అండర్–23 స్టేట్–ఏ ట్రోఫీ కోసం జరగనున్న పోటీలకు అరుణాచల్ ప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏళ్ల సంతోష్ జట్టులో ఆల్ రౌండర్గా రాణిస్తున్నాడు. గతంలో జాతీయ స్థాయి అండర్–16, 17 గేమ్స్లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.