- మాజీ మంత్రి జీవన్ రెడ్డి.
ముద్ర, జగిత్యాల టౌన్: జర్నలిస్టులకు అండగా ఉంటానని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రెస్ భవన్లో ఇటీవల నూతనంగా ఎన్నికైన జిల్లా ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు,ప్రధాన కార్యదర్శి బెజ్జెంకీ సంపూర్ణ చారి,ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, హైదర్ అలీ,కోశాధికారి సిరిసిల్ల వేణు గోపాల్, సంయుక్త కార్యదర్శి చింత నరేష్, కార్యవర్గసభ్యులు, మనోజ్, సాకేతా, రాజిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు మదన్ మోహన్, అంజయ్య, గోపాల చారి, జర్నలిస్టులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
