ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కాల్వపల్లి గ్రామంలోని వట్టిపల్లి రాములమ్మ, గుండేటీ సుభద్ర, బిల్ల లావణ్యలు మృతి చెందారు. నిరుపేద కుటుంబాలు కావడంతో ఇంజ నర్సయ్య ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి ఇంజ నరేష్ కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పద్మశాలి సంఘం, కురుమ సంఘం, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు