ముద్ర ప్రతినిధి, నిర్మల్:
జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలల్లో పది తరగతి ఇంటర్నల్ మార్కుల పరిశీలన గురువారం ముగిసింది. ఇందులో భాగంగా విద్యార్థుల రికార్డులను పరిశీలించి, వారి మూల్యంకనాన్ని చూసారు. వీటిని పదో తరగతి పరీక్షల కోసం వెబ్ లో నమోదు చేస్తారు.