Take a fresh look at your lifestyle.

ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం పైన జాగృతి పోరాటం చేస్తుంది.

 

వచ్చే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో జాగృతి తమ సత్త చాటుతుంది.

కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతానికి గ్రామ స్థాయినుండి నిర్మాణం చెపడుతాం.

మహిళలకు ఇచ్చిన హామీలు, కాల్వల ప్రాజెక్టు మరమ్మత్తు, అటో కార్మికుల సమస్యల మీద త్వరలోనే ప్రభుత్వం పైన పోరాటం చేస్తాం.

ఈరోజు కరీంనగర్ జాగృతి కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లకవాత్ రూప్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సమావేశంలో రానున్న రోజులలో కరీంనగర్ జిల్లాలో జిల్లా ప్రజా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో జాగృతి అనుసరించే విధానం మీద‌ అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రజా సమస్యల మీద ఉద్యమాలు నిర్వహించడం అలాగే సంస్థాగతంగా జాగృతి విస్తరణ జాగృతి బ కమిటీల నియామకాలు ఇలా అనేక విషయాల పైన చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు రూప్ సింగ్‌ మాట్లాడుతూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో మూడు పార్టీలు ఏకమై పనిచేశాయి బయటకు వారు వేరు వేరు రాజకీయ పార్టీలు అయినప్పటికీ అధికారం పంచుకోవడంలో మూడు పార్టీలు ఒకే విధానంలో పని చేస్తున్నాయని వారు అన్నారు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి అభ్యర్థులు మంచి ఫలితాలను సాధించారని వచ్చే జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలలో కూడ జాగృతి తన అభ్యర్థులు పోటీలో నిలుపుతుందాని జాగృతిని గ్రామ స్థాయి వరకు తీసుకుపోయే బాధ్యతలను ప్రతి నాయకులు బుజాన వేసుకొని ముందుకు పోవాలని జాగృతి నాయకులు వారు అన్నారు.
జాగృతి జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో జాగృతి బలోపేతం కోసం జిల్లాలో అన్ని స్థాయిలలో కమిటీ నిర్మాణం చేయడం జరుగుతుందని అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చేవరకు జాగృతి ప్రజలను కలుపుకుని ప్రజా ఉద్యమాలు చేపడుతుందని‌ వారు అన్నారు కరీంనగర్ జిల్లాలో ఉన్న కాల్వల ప్రాజెక్ట్ కు మరమ్మత్తులు ‌చెప్పట్టాలి అదేవిధంగా మహిళలు ముఖ్యమంత్రి రేవ‌ంత్ రెడ్డి ఇస్తామని చెప్పిన ‌2500/- నగదు వెంటనే ఇవ్వాలి, వృద్ధులు, వికలాంగులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం 4000/- పించన్ వెంటనే అమలు చెయ్యాలి, అదేవిధంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం కూడ ఇవ్వాలి విద్యార్థినిలకు‌ స్కూటి బండి, అలాగే మహిళలకు కోటిశ్వరులను చేస్తామని ఇచ్చిన మాట కూడ నిలుపుకోవాలి లేనిపక్షంలో కరీంనగర్ జిల్లాలో జాగృతి ఆద్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చెపడుతాం అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, మహిళ‌ విభాగం జిల్లా అధ్యక్షురాలు అక్కం శివరాణి, ‌బిసి విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల రమేష్, అధివాసి విభాగం జిల్లా అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, జిల్లా ముఖ్య నాయకులు రంగరవేణి లక్ష్మణ్, చండి శ్రీనివాస్, గాలిపెల్లి రత్నాకర్ చారి, సాయికృష్ణ, బుర్ర నాటారాజ్, కోరపల్లి నరేష్, కొత్తురి రఘు, సంగీత రెడ్డి, బండ అశోక్, సంతోష్‌ యాదవ్, రొంటాల రాజ్ కుమార్, జైపాల్ రెడ్డి, రోజా‌ రెడ్డి, బశేట్టి కృష్ణవేణి, గర్శకుర్తి విద్యాసాగర్, పుసాల పవన్, మెంగని‌ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.