- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : పార్టీలో నెలకొన్న సమస్యలను చర్చించేందుకు వ్యక్తిగతంగా తమకు సమయాన్ని కేటాయించాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. ఎక్కడ, ఎప్పుడు అనేది నిర్ణయిస్తే అప్పుడు వచ్చి కలిసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాజాసింగ్ ప్రకటించారు. తెలంగాణకి బీజేపీ ప్రభుత్వం అవసరమని, వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా కలిసి పనిచేద్దామని రాజాసింగ్ పిలుపునిచ్చారు.