Take a fresh look at your lifestyle.

కేసీఆర్​తో కేటీఆర్​ భేటీ

  • వాటిజ్​ దిస్​ డాడీ..! 
  • కవిత లేఖపై మొదలైన పరిశీలన.
  • నాలుగు గంటలకుపైగా చర్చలు.
  • కవిత లేఖపైనే ప్రధాన డిస్కషన్​.
  • ఎందుకు.. కారణాలేమిటి అనే అంశంపై ఇద్దరి మధ్య చర్చలు. 
  • తర్వాత పరిణామాలపైనా..! 
  •  ఇద్దరి మధ్యే సుదీర్ఘంగా చర్చ. 
  •  జూన్​ 2 అవతరణ వేడుకలపైనా కూడా. 
  • ఈ నెల 28న అమెరికాకు కేటీఆర్.​ 
  •  పరిస్థితులన్నింటీని తండ్రికి వివరించిన కేటీఆర్​.
ముద్ర, తెలంగాణ బ్యూరో:  గులాబీ పార్టీలో కల్వకుంట్ల కవిత రాసిన లేఖ చిచ్చు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు.   ప్రస్తుతం ఆ లేఖ పార్టీలో ప్రకృంపనలు సృష్టిస్తోంది.కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారని వారి వల్లే పార్టీకి ఈ పరిస్థితి దాపురించిందన్న అంశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది.ఎవరా దెయ్యాలు అన్న అంశంపై ప్రజల్లోనూ వాడివేడిగా చర్చ సాగుతోంది.దీంతో ఈ వ్యవహారం ఎటు నుంచి ఎటు పోతుందో తెలియని అయేమయం పార్టీలో  నెలకొంది.  అసలే అధికారానికి దూరమై అనేక ఇబ్బందులు పడుతున్న వేళ కవిత రాసిన లేఖ అందుకు రెండింతలు పార్టీకి తలనొప్పిని కలిగిస్తోంది.ఓటమి నుంచి కోలుకుని కాంగ్రెస్ పై సై అంటున్న సమయంలో కవిత రాసిన లేఖ ఒక్కసారిగా గులాబీ పార్టీని ఒక్క కుదుపేసింది.పైగా త్వరలోనే కవిత బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతోందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.ఈ పరిణామాల నేపథ్యంలో రం ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ లో పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదివారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  కలిశారు.నాలుగైదు రోజులుగా పార్టీలో జరగుతున్న పరిణామాలు కవిత రాసిన లేఖపై కేసీఆర్ తో ఆయన ప్రధానంగా చర్చించారు.సుమారు నాలుగు గంటల పాటు జరిగిన సమావేశంలో కవిత లేఖపైనా ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం.అసలు ఆమె లేఖ రాయడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటీ? ఆమె ను వెనక నుంచి నడిపిస్తున్నది ఎవరు? అందుకు గల కారణాలేంటీ? అన్న అంశాలపై వారిద్దరు  పలు కోణాల్లో లోతుగా ఆరా తీశారని తెలుస్తోంది.
లేఖలో కవిత పొందు పరచిన  ప్రతి అంశాన్ని కూడా వారు చర్చించారని సమాచారం.రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారం లో ఎలా ముందుకు సాగుదాం?పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలు మునుముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన అంశాలపై కూడా కేసీఆర్, కేటీఆర్ లు చర్చించారని సమాచారం. అయితే భవిష్యత్తులో పార్టీలో మరే నాయకుడు కూడా ఇలాంటి సాహాసానికి వడిగట్టకుండా కవితపై చర్యలు తీసుకుందామా? లేక కొద్ది రోజుల పాటు వేచి చూసే  ధోరణిని అవలంబిద్దామా? అన్న అంశంపై కూడా వారు  చర్చించినట్లు తెలుస్తోంది. వెనువెంటనే చర్యలు తీసుకుంటే వచ్చిపడే సమస్యలు ఏంటీ? ఒక వేళ ఆలస్యంగా చర్యలు ఏమైనా తీసుకుంటే ప్రజల్లో మరింత చులకన భావం పెరుగుతుందా?అన్న కోణంలోనే సమాలోచనలు చేశారని తెలుస్తోంది.ఇదిలా ఉండగా కవిత కదలికలపై ఒక కన్నేసి ఉంచిన కేసీఆర్ ఆమె విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి తొందర పాటు నిర్ణయాలకు తావివ్వద్దని కేటీఆర్ కు సూచించారని తెలుస్తోంది.ముందు పార్టీ శ్రేణుల్లో ధైర్యం కల్పించి మరింత ఉధృంతగా కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేసే విధంగా సమాయత్తం చేయాలని ఆదేశించారు. కాగా ఈ సమావేశంలో  కవిత అంశంతో పాటు జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, బీఆర్ఎస్ పోరాట ఫలితంగా రాష్ట్ర అవతరణ అని నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సైతం చర్చించారు.కాగా కేటీఆర్ ఈ నెల 28వ తేదీన అమెరికాకు బయలు దేరుతున్నారు.ఈ నేపథ్యంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులన్నింటిని కేసీఆర్ కు వివరించారు.తాను పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు తిరిగి చేరుకునే లోగా  కవిత ఇష్యూను పరిష్కరించాలని కేటీఆర్ కోరినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
  • పార్టీ వర్గాల్లో ఉత్కంఠ
కేసీఆర్, కేటీఆర్ సమావేశంపై పార్టీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. కవిత రాసిన లేఖ, పార్టీ అధిష్టానం ఆమె చేసిన వ్యాఖ్యలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.  దీంతో గులాబీ రాజకీయాలు రోజుకో విధంగా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇవి చిలికి చిలికి గాలివానలా మారి పార్టీని పూర్తిగా ముంచేస్తాయా?  లేదా టీ తప్పులో తుఫాన్ లా కవిత లేఖ మారుతుందా అన్నది  మునుముందు తేలనుంది. అప్పటి వరకు గులాబీ పార్టీలో ఇలాంటి ఎపిసోడ్ లకు శుభం కార్డు పడే పరిస్థితి కనిపించే అవకాశాలు లేవని  తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.