Take a fresh look at your lifestyle.

కేటీఆర్ నగర్‌లో రూ.1.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

 

కాప్రా ముద్ర

ఉప్పల్ డివిజన్ పరిధిలోని కేటీఆర్ నగర్‌లో రూ.1 కోటి 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఆయన కాలనీలో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యమని తెలిపారు.
కాలనీ వాసులతో కలిసి పనులు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ హనుమంత్ రెడ్డి, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.