Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కట్టె లేకుండా నడవడం పక్కన పెట్టు….. దమ్ముంటే సీఎం కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపాలి

  • ఆయన సంస్కారం లేకుండా మాట్లాడడం సిగ్గుచేటు
  • కేసీఆర్ కొట్టే దెబ్బ ఎట్లుంటదో రేవంత్ కు ఇంకా తెలియదు
  • కావాలంటే ఆయన పాత గురువును అడిగి తెలుసుకోవాలి
  • రేవంత్ రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసింది
  • ఇక ఆయనకు సినిమా చూపిస్తాం 
  • హెచ్చరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- కేసీఆర్ కట్టె లేకుండా నడవడం పక్కన పెట్టు…..దమ్ముంటే సీఎం  రేవంత్ రెడ్డి కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుడు (కేసీఆర్)ను పట్టుకొని కట్టె పట్టుకొని నిలబడమంటూ ఆయన సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు.కేసీఆర్ పై  రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఘాటుగా స్పందించారు.  కేసీఆర్  కట్టె లేకుండా నిలబడతాడు కానీ… రేవంత్ రెడ్డి కమిషన్ లేకుండా ప్రభుత్వాన్ని నడపలేడని ఎద్దేవా చేశారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టినవాడు కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు.
కేసీఆర్ కొట్టే దెబ్బ ఎట్లుంటదో రేవంత్ కు  ఇంకా తెలియదన్నారు.  కావలంటే ఆయన పాత గురువు (చంద్రబాబు)ను అడిగి తెలుసుకోవాలన్నారు.  అలాగే కొత్త బాస్ రాహుల్ వాళ్ళ అమ్మని అడగాలన్నారు.  రేవంత్ రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసిందని….,ఇక పైన సినిమా చూపిస్తామని హెచ్చరించారు.కేసీఆర్  అసెంబ్లీకి రావడం కాదు…. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలన్నారు.  రేవంత్ రెడ్డి వచ్చినా…. రాకున్నా కొడంగల్ కి మాత్రం త్వరలో నేను వస్తున్నా… నీకు దమ్ముంటే ఆపకోమని కేటీఆర్ సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు.  కానీ కచ్చితంగా కొడంగల్ వస్తా…నీ సంగతి చూస్తానని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా…. అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడన్నాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని…ఆయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రిలు పనిచేసిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు. ఇప్పటికైనా ఆయన బూతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సారించాలని సూచించారు.  రేవంత్ రెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీ జేజమ్మలు దిగివచ్చినా కేసీఆర్  పేరును చెరపడం ఎవరి సాధ్యం కాదన్నారు. 
తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా అభివృద్ధి చేసిన నాయకుడిగా కేసీఆర్ పేరు చరిత్రలో నిలబడిపోతుందన్నారు.రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతుబంధు భరోసాపైన…  బీఆర్ఎస్ పది సంవత్సరాల ప్రభుత్వం పైన అనేక అబద్ధాలు ముఖ్య మంత్రి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు.  ఆయన అబద్దాలు తప్ప నిజాలు చెప్పడం లేదన్నారు. అబద్ధాలు చెప్పకుంటే ఆయన తల పగిలిపోతుందన్న శాపం  రేవంత్ రెడ్డికి ఉన్నట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు.  కేసీఆర్ ఎడ్డమంటే …. తెడ్డమనాలన్న ఏకైక లక్ష్యంగా రేవంత్ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. 
బీఆర్ఎస్  పాలనలో టింగ్ టింగ్ మని వేలకోట్ల రూపాయలు రైతన్న ఖాతాలో ఇస్తే… రేవంత్ రెడ్డి టకీ టకీ అని రైతుబంధు వేస్తున్నామని చెప్పే అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు.  రైతన్నలకి, ఆడబిడ్డలకి, విద్యార్థులకి టకి టకీ మని డబ్బులు పడుతున్నాయా లేదా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ సిబ్బందికి కూడా టకీ టకీ మని జీతాలు కూడా పడడం లేదన్నారు. రేవంత్ మాదిరి మేము తిట్టడం మొదలుపెడితే తట్టుకోలేరన్నారు. రేవంత్ రెడ్డి ఇస్తామని హమీ ఇచ్చిన రైతుబంధు ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు.  రూ. 73వేల కోట్లను  రైతన్నల ఖాతాల్లోకి వేసిన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. 13 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క రైతుబంధు కూడా……  అప్పటి బీఆర్ఎస్  ప్రభుత్వం ఇద్దామనుకున్న డబ్బులని అడ్డుకొని ప్రభుత్వం వచ్చినాక ఇచ్చారన్నారు. అంతే తప్ప కొత్తగా కొత్తగా ఒక్క రూపాయి కూడా రైతుబంధు ఇయ్యలేదన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రైతుబంధు వేస్తామంటూ డ్రామా వేస్తున్నాడని మండిపడ్డారు. ఎన్నికల తర్వతా మళ్ళీ కాంగ్రెస్ నేతలు మాయం అవుతారన్నారు.

Leave A Reply

Your email address will not be published.