ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు విడుదల అయ్యేలా చూస్తానని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. ముధోల్ నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధుల ఉత్తర్వులను సంబంధిత గ్రామాల ప్రజాప్రతినిధులకు అందజేశారు. భైంసా మండలం వాలేగాం గ్రామానికి రూ.15 లక్షలు, ముధోల్ మండలం మచ్కల్ గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.5 లక్షల నిధుల మంజూరు పత్రాలను అందజేశారు