రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల జాబితాను పునః పరిశీలించాలని బీఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ డిమాండ్ చేశారు.శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కుమార్ దీపక్ కు వినతి పత్రాన్ని అందించారు.పార్టీ నాయకులకు,కార్యకర్తలకు కాకుండా అర్హులైన పేదవారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందించాలని కోరారు.సీనియర్ నాయకులు రామిడి కుమార్,బడికల సంపత్,రేవెల్లి ఓదెలు,జిలకర మహేష్,అనిల్ రావు,సధి,అరుణ్,లక్ష్మీకాంత్,శివ పాల్గొన్నారు.