ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: పెద్దపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు శుక్రవారం ఇద్దరు వ్యక్తుల వద్ద గంజాయి పట్టుకున్నారు.వాహనాలు తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న రేకుర్తి గ్రామానికి చెందిన బండారి శివకుమార్ (20), జంగపల్లి రామ్ చరణ్ (18) అనే ఇద్దరిని పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేయగా సుమారు రూ.5000 విలువైన 199.15 గ్రాముల ఎండు గంజాయి లభ్యమై సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.