- స్పందించి..చెత్తను తొలగించి
రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక అశోక్ నగర్ సమీపంలో రహదారి అనుకోని పేరుకుపోయిన చెత్తను సింగరేణి సివిల్ విభాగానికి చెందిన పారిశుద్ధ్య కార్మికులు తొలగించారు. చెత్తను తరలించడంలో నిర్లక్ష్యం అనే శీర్షికన ప్రచురించిన ముద్ర కథనానికి తక్షణమే స్పందించి చెత్తను తొలగించారు. కార్మిక వాడల్లో రిక్షా సైకిల్ సహాయంతో ప్రతి ఇంటింటికీ సేకరించిన చెత్తను ఓ చోట వేసి ట్రాక్టర్ సహాయంతో డంప్ యార్డ్ కు తరలిస్తున్నట్లు సూపర్వైజర్ తెలిపారు.