మాదాపూర్, ముద్ర విలేఖరి: శేరిలింగంపల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్, భోర్ఖడే, డిప్యూటీ కమీషనర్ హేమంత్ వి ప్రశాంతి ని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలబొకే ఇచ్చి సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న పలు సమస్యలను, చేపట్టవలసిన పలు అభివృద్ధి పనులపై జోనల్ కమీషనర్ తో చర్చించామని తెలిపారు.అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు.
