ముద్ర ప్రతినిధి, నిర్మల్:
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ ఉగాది వేడుకల్లో నిర్మల్ కు చెందిన కవులు డా.దామెర రాములు, డా.తుమ్మల దేవరావు తమ కవితాగనం చేశారు.
తెలంగాణ మాగాణి గురించి దామెర రాములు తన కవితలో వివరించారు. ఇక “కాలం కాస్త స్తంభించి పోనీ” కవితలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం, వనరుల కోసం పెరిగిన యుద్ధ కాంక్ష గురించి వివరించారు. నిర్మల్ కవులు రాష్ట్ర రాజధాని లోని రవీంద్ర భారతి వేదికగా కవితా గానం చేసి ఉగాది పురస్కారం పొందడంతో స్థానిక కవులు హర్షం వ్యక్తం చేశారు.