ముద్ర,రాయికల్ : వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపాలిటీ నందు 12 వార్డులో మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమం లో పూలచెట్లు గులాబీ, మందార, పండ్ల చెట్లు జామ,ఉసిరి,నిమ్మ, దానిమ్మ, మారేడు చెట్లను ఇంటింటికీ పంపిణీ చెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మనోహర్ గౌడ్ మరియు మేనేజర్ వెంకటి మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.