కోరుట్ల/కథలాపూర్, ముద్ర:జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో బుధవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తాండ్రియాల గ్రామంలో నూతన ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్ ప్రారంభించారు. అనంతరం తక్కళ్ళపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించే గంగమ్మ దేవాలయ నిర్మాణ భూమి పూజ మహోత్సవం లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పూండ్ర నారాయణరెడ్డి, నాయకులు పులి హరిప్రసాద్, తదితరులు ప్రభుత్వ విప్ వెంట ఉన్నారు.
