మాదాపూర్, ముద్ర : మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ టవర్ ఎదురుగా ఫ్లైఓవర్ కింద ఒక గుర్తు తెలియని వ్యక్తి శవాన్ని పోలీసులు గుర్తించారు.మరణించిన వ్యక్తి మధ్య వయసు కలిగి ఉంటాడని, ముఖం పై యాసిడ్ పోసిన ఆనవాళ్లు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ సంప్రదించాలని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు.