- జేఏసీ చైర్మన్ వకలాభరణం నరసయ్య పంతులు.
ముద్ర, చేర్యాల: పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దుల్మిట్ట, కొమరవెల్లి,చేర్యాల, మద్దూరు మండలాలకు చెందిన అఖిలపక్ష నాయకులు మానవహారం నిర్వహించారు.అనంతరం వకళభరణం నరసయ్య పంతులు మాట్లాడుతూ చేర్యాలను డివిజన్ గా ప్రకటించాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యావేత్తలు, మేధావులు, వ్యాపారస్తులు, విశ్రాంత ఉద్యోగులు, రెవిన్యూ డివిజన్ కు సంబంధించిన ఆకాంక్షపరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, బిజెపి, సిపిఎం, టిడిపి, టిఎంఆర్పిఎస్ సంబంధించిన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.