ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా గోవింద నాయక్ సోమవారం సాయంత్రం దండేపల్లి మండలం లింగాపూర్ లోని తమ నివాసంలో మృతి చెందారు. ఆయన ఖానాపూర్ ఎమ్మెల్యే గా మూడు పర్యాయాలు గెలుపొందారు. తొలి సారి ఇండిపెండెంట్ గా గెలుపొందిన గోవింద్ నాయక్ అనంతరం తెలుగు దేశ , బి ఆర్ ఎస్ ఎంఎల్ఏ గా కొనసాగారు. గత కొంత కాలంగా అస్వస్థతతో ఉన్నారు.