అమరావతి: సి. రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ గురువారంనాడు బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అభినందనలు తెలిపారు. ఐజేయు కార్యదర్శులు డి సోమసుందర్, వై. నరేందర్ రెడ్డి, ఏపీ యూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్, టీయూడబ్ల్యూజే కార్యదర్శులు కే శ్రీకాంత్ రెడ్డి, మధు గౌడ్, ఐ జేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎ. ఇంద్రారెడ్డి, పలువురు ఏపీ యూడబ్ల్యూజే నేతలు, జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో పాల్గొని సురేష్ కుమార్ కు అభినందనలు తెలిపారు.



.