Take a fresh look at your lifestyle.

దారులన్నీ ఓరుగల్లుకే…!

  •  గులాబీమయమవుతున్న రోడ్లు.
  • ప్రత్యేకంగా గులాబీ రంగుల్లో అంబాసిడర్​ కార్లు. 
  • వాటర్​ బాటిల్​ సహా ప్రతిదీ గులాబీ పార్టీ గుర్తుపైనే. 
  • ఒక్కో సెగ్మెంట్​ నుంచి భారీగా జనం.
  • జిల్లా, నియోజకవర్గ, మండలాల వారీగా ఇన్ ఛార్జ్ లు.
  • ఇప్పటికే ఎల్కతుర్తికి చేరుకున్న కొంతమంది బీఆర్​ఎస్​ కార్యకర్తలు.
  • వచ్చిన వారందరికీ భోజనాలు, వసతి ఏర్పాట్లు.
ముద్ర,తెలంగాణ బ్యూరో:రాష్ట్ర మంతా గులాబీ మయం అవుతోంది.ఎక్కడ చూసినా గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.ప్రధాన రహదారులు, వీధులు, ముఖ్య కూడళ్లు అన్ని గులాబీ రంగుల జెండాలతో మెరిసిపోతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ  పెద్దఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు.  సినిమా హీరోల కటౌట్లను తలపించేలా పార్టీ నేతలు కేసీఆర్ నిలువెత్తు  కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో  ఏ వీధి, ఏ గ్రామం చూసినా   గులాబీ నేతల జోష్ కనిపిస్తోంది.పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో పార్టీ రజతోత్సవ సభను ఏర్పాటు చేసింది. తెలంగాణలో గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ సభను నిర్వహించడం ద్వారా మరోసారి బీఆర్ఎస్ సత్తా ఏంటో  చాటుకోవాలని గులాబీ పార్టీ ఉవ్వీలూరుతోంది.ప్రధానంగా  రాష్ట్ర అధికార కాంగ్రెస్ తో పాటు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వణుకుపుట్టే విధంగా లక్షలాది మంది సభను నిర్వహించే విధంగా గులాబీ  పార్టీ రూపకల్పన చేసింది.అందుకు తగిన విధంగానే భారీ ఏర్పాట్లు చేస్తోంది.ఇందులో భాగంగానే వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో  గతంలో ఎన్నడూ లేనివిధంగా జన సమీకరణ  చేపట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు బస్సులు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులను  బస్సులను కూడా ఇప్పటికే బీఆర్ఎస్  నేతలు తమ ఆధీనంలో పెట్టుకున్నారు.ప్రైవేటు  కార్లు, జీప్ లు, ఇతర వాహనాలను కూడా సమకూర్చుతున్నారు. దీంతో దారులన్నీ ఓరుగల్లు వైపే అన్న చందంగా వాహన శ్రేణులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సభ కోసమే గులాబీ రంగుల్లో అంబాసిడర్  కార్లు సైతం సిద్ధం అవుతున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి పదిలక్షల మందికి తక్కువ కాకుండా సభకు తరలించేందుకు  పార్టీ శ్రేణులు శ్రమిస్తున్నారు.ఈ మేరకు జిల్లా, నియోజకవర్గాలు, మండలాల వారిగా ఇప్పటికే పార్టీ అధిష్టానం ఇన్ ఛార్జీలను నియమించింది.పార్టీ అధిష్టానం తమకు అప్పగించిన పనిని పూర్తి చేసేందుకు వారు సైతం నిరంతరం తపిస్తున్నారు.దీంతో  రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల జోష్ మరింత  పెరిగింది. కాగా సభ కు జనాన్ని భారీగా తరలించి ఒక  చరిత్రను సృష్టించాలన్న లక్ష్యంతో పార్టీ శ్రేణులు ఇప్పటికే ఇంటింటికీ  కరపత్రాలు పంచుతూ, బొట్టుపెట్టి మరీ వరంగల్ సభకు రావాలంటూ ఆహ్వానిస్తున్నారు. 1213 ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్దం చేశారు. లక్షలాదిగా జనం హాజరైనప్పటికీ ఎవరెక్కడ కూర్చున్నా వేదికపై జరుగుతున్న వేడుకలు, కేసీఆర్ ప్రసంగం సభాప్రాంగణం మొత్తం క్లారీటీగా కనిపించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేశారు. ఎండలు దంచికొడుతున్న వేళ సభా ప్రాంగణం మొత్తం చల్లటి వాతావరణం ఉండేలా టెంట్లు, కూలర్లతోపాటు అత్యాధునిక టెక్నాలజీని వాడిని ఎండవేడి నుంచి కార్యకర్తలకు రక్షణ కల్పించేలా సర్వం సిద్దం చేశారు. ఇదిలా ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకూ వేడుకలు జరిగే అవకాశం ఉండటంతో ఎండ వేడిని తట్టుకునేందుకు 10లక్షల మజ్జిన ప్యాకెట్లు పంచేందేందుకు ఏర్పాట్లు చేశారు.తాగునీటికి సమస్య లేకుండా ఏకంగా 10లక్షల వాటర్ బాటిల్స్  తెప్పించారు. ఇంకా అవసరమైతే వాటర్ బాటిల్స్  తెచ్చేందుకు గులాబీ టీమ్ సిద్దమైంది.అయితే ప్రజలకు ఇచ్చే  ప్రతి వాటర్ బాటిల్ గులాబీ గుర్తు ఉండే విధంగా  ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఒకేసారి వేదికపై 500 మంది బీఆర్ ఎస్ నాయకులు కూర్చునేలా అత్యంత భారీ ఏర్పాట్లు సిద్దం చేశారు. కేసీఆర్ , కేటీఆర్ లతో సెల్పీలు దిగే ముచ్చట తీర్చేందుకు ప్రత్యేకంగా సభా ప్రాంగణంలో సెల్పీ బోర్డులు ఏర్పాటు చేశారు.విద్యుత్ కోతల ప్రభావం కారణంగా సభకుల ఎటువంటి ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఏకంగా 200 జనరేటర్లను సిద్దం చేశారు. అనారోగ్య సమస్యలు, వడదెబ్బ  వంటివి తలెత్తినప్పుడు వెంటనే వైద్య సదుపాయం అందించేందుకు 100కి పైగా వైద్య బృందాలను సభా ప్రాంగణంలో అందుబాటులో ఉంచారు. అత్యవసర సమయంలో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించేందుకు 20 అంబులెన్స్ లు సైతం ఏర్పాటు చేశారు. తాత్కాలిక టాయిలెట్స్, సభకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు 2వేలమంది వాలంటీర్లను అందుబాటులో ఉంచారు.కాగా సభ కోసం ముందుగానే  ఎల్కతుర్తికి చేరుకుంటున్న పార్టీ  శ్రేణులు, నాయకులకు ఎటువంటి లోటు  పాట్లు లేకుండా స్థానిక నేతలు భోజనాలు,  వసతి ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా సభ కోసం తరలివచ్చే వాహనాల పార్కింగ్ కోసం వీలుగా ఐదు జోన్ల వారీగా రూట్‌ మ్యాప్‌లను సిద్ధం చేశారు.వాటిల్లో జోన్‌ 1: నేషనల్‌ హైవే 163 మీదుగా గుడెప్పాడ్‌, ఆరేపల్లి, హసన్‌పర్తి, ఎల్లాపూర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలతోపాటు మరో రూట్‌ అయిన హసన్‌పర్తి, ఎల్లాపూర్‌ మీదుగా ఈ పారింగ్‌ స్థలానికి చేరుకునే అవకాశం ఉన్నది.మరోవైపు కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌ రోడ్‌ వరకు వివిధ మార్గాల ద్వారా చేరుకున్న వాహనాలు హసన్‌పర్తి, ఎల్లాపూర్‌ మీదుగా ఈ జోన్‌-1 పారింగ్‌కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
జోన్‌ 2: కరుణాపురం, దేవన్నపేట, మడిపల్లి అనంతసాగర్‌ మీదుగా ఈ పారింగ్‌ చేరుకునే అవకాశం ఉన్నది. మరో రూట్‌ అయిన వరంగల్‌లోని నాయుడు పెట్రోల్‌ పంప్‌, భట్టుపల్లి, కడిపికొండ ఆర్‌వోబీ, మడికొండ మీదుగా దేవన్నపేట, మడిపల్లి, అనంతసాగర్‌ నుంచి ఈ పారింగ్‌ జోన్‌-2కు చేరుకునేలా ఏర్పాట్లుచేశారు. మరోవైపు చింతగట్టు, జయగిరి, అనంతసాగర్‌ మీదుగా కూడా జోన్‌-2కు చేరుకోవచ్చు.
జోన్‌ 3: ధర్మసాగర్‌ మీదుగా దేవునూరు, దామెర, చింతలపల్లి నుంచి వచ్చే వాహనాలు పారింగ్‌ చేసుకునేలా జోన్‌-3లో ఏర్పాట్లు చేశారు.
జోన్‌ 4: కరీంనగర్‌ జాతీయ రహదారి 563 మీదుగా వచ్చే వాహనాలు హుజూరాబాద్‌, కోతులనడుమ, గ్రానైట్‌ క్వారీ మీదుగా ఈ పారింగ్‌ జోన్‌-4కు వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
జోన్‌ 5: సిద్దిపేట జాతీయ రహదారి 765(డీజీ) మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్‌, ములనూరు, గోపాల్‌పూర్‌ క్రాస్‌రోడ్‌, ఇందిరానగర్‌ మీదుగా ఈ పారింగ్‌ జోన్‌-5కు చేరుకునేలా ఏర్పాట్లుచేశారు. మరో రూట్‌లో వేలేరు, కొత్తకొండ, ముత్తారం వైపు నుంచి పారింగ్‌ జోన్‌-5కు చేరుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. మరో రూట్‌ అయిన కరీంనగర్‌ మీదుగా వచ్చే వాహనాలు కోతులనడుమ మీదుగా దారి మళ్లించుకుని గోపాల్‌పూర్‌, గోపాల్‌పూర్‌ క్రాస్‌రోడ్‌, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇందిరానగర్‌ నుంచి పారింగ్‌ జోన్‌-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

Leave A Reply

Your email address will not be published.