మల్యాల,ముద్ర విలేకరి: ఉత్తమ నిధులు నిర్వహణలో ప్రశంసలు పొందిన ఎడిపెల్లి మహోత్ర శనివారం ఉత్తమ ఉద్యోగి గా అవార్డు అందుకుంది. మల్యాల మండలం రాజారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ ఎడిపెల్లి అశోక్ – సుగుణ ల కూతురు హైదరాబాద్ నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇటీవల జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం సాధించిన మహోత్ర ఇంటర్ బోర్డు ప్రిన్సిపల్ సెక్రెటరీ చేతుల మీద ఉత్తమ ప్రశంసలు పత్రం అందుకుంది. దీంతో నాయకులు, గ్రామ ప్రజలు పలువురు హర్షం వ్యక్తం చేశారు.