Take a fresh look at your lifestyle.

శ్రీ స్వామివారికి అష్టదళ పాదపద్మార్చన సేవ

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దివ్య పాదారవిందములకు 108 బంగారు అష్టదళ పద్మ పుష్పాలతో, అష్టోత్తర శతనామాలతో అష్టదళ పాదపద్మార్చన సేవ చేశారు.


బుధవారం ఆలయంలో సుప్రభాత సేవ, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, ముప్పది మూడు కోట్ల దేవతలు కొలువుతీరినట్టి గోపృష్ట దర్శనం చేయించారు. స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీవారి వైభవోత్సవ మండపంలో వేదమంత్రాలతో మంగళ ధ్వనుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించి ఆనంద పరవశులైనారు.

Leave A Reply

Your email address will not be published.