మాదాపూర్, ముద్ర విలేఖరి: బక్రీద్ పర్వదినంను పురస్కరించుకుని ఆల్విన్ కాలనీ డివిజన్ కు చెందిన ముస్లిం సోదరులు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియ చేసిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్బంగా చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ బక్రీద్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని,చాలా పవిత్రమైన పండుగ అని,మత సామరస్యానికి ప్రతీక అని ,త్యాగానికి ప్రతి రూపంగా నిలిచే ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని అల్లాను ప్రార్థిస్తూ మత సామరస్యాన్ని ప్రతిభింభించేలా బక్రీద్ పండుగను భక్తి శ్రద్దల తో జరుపుకోవాలని కోరుకుంటూ ముస్లిం సోదర సోదరీమణులందరికి బక్రీద్ పర్వదిన శుబాకాంక్షలు తెలియచేయడం జరిగినది. బక్రీద్ చాలా పవిత్రమైన పండుగ అని, మత సామరస్యానికి ప్రతీక అని,ముస్లిం సోదరులందరు.పండుగను చక్కటి వాతావరణం లోకుటంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా, సంతోషకరంగా జరుపుకోవాలని కోరారు.బక్రీదు పండుగను విజయవంతంగా, ఆనందముగా జరుపుకోవాలని చైర్మన్ గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రఘుపతి రెడ్డి, ప్రసాద్, రామచంద్రారెడ్డి, అనిల్ మరియు ముస్లిం సోదరులు ఇస్మాయిల్, మున్నా, కైసర్, చాంద్ మరియు తదితరులు పాల్గొన్నారు.