Take a fresh look at your lifestyle.

రైతుబంధు కొనసాగిస్తే రేవంత్ ను ఎవరూ దేకరు

 

  • అదే ఆయన భయం 
  • అందుకే బంధు ఎగవేతకు యత్నం
  • రేవంత్​ దృష్టిలో మోసం చేసుడు కూడా చారిత్రాత్మకమే
  • నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణం కాంగ్రెస్​
  • వరి పంటను దేశంలో నెంబర్​ వన్​ చేసింది కేసీఆర్​
  • రైతాంగ పోరాట స్పూర్తి తరహాలో ఇప్పుడు రైతులు తిరగబడేందుకు నల్లగొండ వేదిక కావాలి
ముద్ర, తెలంగాణ బ్యూరో :- బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బంధును అమలు చేస్తే… సీఎం రేవంత్ రెడ్డిని  ప్రజలు ఎవరు దేకరన్న   భయంతోనే బంధును ఎగవేత వేయాలని యత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆయన దృష్టిలో మోసం చేయడం ఒక చారిత్రాత్మకమే  అన్న భ్రమలో ఉన్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాలు బంద్…అభివృద్ధి పథకాలు బంద్ అన్న రీతిలో పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. సకలం బంద్  చేస్తున్న  కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు  కూడా ఇక  ఆ పార్టీని  బొంద పెట్టేందుకు సమాయత్తం అవుతున్నారన్నారు. తగు సమయం కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు మహా ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తనదైన శైలిలో రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రానున్న స్థానిక సంస్థలు, పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్‌ మళ్లీ రైతుభరోసా నాటకం ఆడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికలు అయిపోంగనే రైతుబంధు మళ్లీ బందేనని అన్నారు. ఇప్పటి వరకు రేవంత్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క దానినైనా సమగ్రంగా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. రేవంత్, ఆయన మంత్రివర్గమంతా  రోజుకొక విధంగా అబద్దాలు ఆడుతూ రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రివర్గమంతా అలీబాబా అరడజన్   దొంగలు అన్న చందంగా మారిందన్నారు. ఎవరికి  బాధ్యత లేదన్నారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  దీంతో సం క్షేమ పథకాల అమలులో అన్ని అనుమానాలు…సందేహాలు ప్రజల్లో నెలకున్నాయని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను జనం నిలదీయాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డి అన్ని పంటలకు క్వింటల్‌కు రూ.500 బోనస్‌ ఇస్తమన్నడు. మరె ఎవరికన్నా బోనస్‌ పైసలు పడ్డయా..? అని ప్రశ్నించారు. మరి ఇప్పుడు మాట మార్చి సన్న వడ్లు పండిస్తెనే బోనస్‌ ఇస్తాం అంటున్నారని సెటైర్లు వేశారు. మరో వైపు వ్యవసాయ శాఖ మంత్రి అయితే సన్న వడ్లకు బోనస్ ఇచ్చుడు బాగుంది, రైతు భరోసా అక్కెరే లేదని రైతులే చెప్తున్నారని అంటున్నాడని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం  రైతు భరోసా ఇస్తాం అని నాటకమాడుతున్నారని  కేటీఆర్ వ్యాఖ్యానించారు. 
‘కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అన్నీ బందు అవుతాయని కేసీఆర్‌ ఎన్నికల  సభల్లో చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.కేసీఆర్‌ హయాంలో నాట్లప్పుడు రైతుబంధు పడేదని,,, కానీ రేవంత్‌ పాలనలో ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు పడుతున్నదని ఎద్దేవా చేశారు.  ఇక నల్లగొండ బిడ్డల బొక్కల్లో మూలుగ చావడానికి కారణమే కాంగ్రెస్‌ పార్టీ అని కేటీఆర్‌ మండిపడ్డారు. జిల్లా రైతుల అవస్థకు కారణమే కూడా ఆ పార్టీయేనని అన్నారు. దేశంలోనే వరి పంటను  కేసీఆర్ నంబర్ వన్  చేస్తే….అబద్దాలు ఆడి ప్రజలను మోసం చేయడంలో తెలంగాణ  దిట్ట  అన్న చందంగా రేవంత్ పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. అందుకే మోసకారి   ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాట చేయడానికిస నల్గొండ  జిల్లా వేదిక కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.