రామకృష్ణాపూర్, ముద్ర : టీచర్స్,పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం పట్ల పట్టణ నాయకులు గురువారం సాయంత్రం సంబరాలు జరుపుకున్నారు.స్థానిక సూపర్ బజార్,రాజీవ్ చౌక్ చౌరస్తాలలో టపాసులు కాల్చి,మిఠాయిలు పంచిపెట్టారు.పట్టణ అధ్యక్షుడు దన్ సింగ్,సీనియర్ నాయకుడు అరుముల్ల పొషం,ఈశ్వర చారి,వైద్య శ్రీనివాస్,వేముల అశోక్,గడ్డం సంపత్ గౌడ్,సతీష్,సంతోష్ రామ్,పద్మ తదితరులు పాల్గొన్నారు.