ముద్ర, విశాఖపట్నం: కేంద్రం ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,500/- కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించ్చడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.కేంద్ర ప్రభుత్వానికి, ఏపి సీఎం నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు..శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానన్నారు. తమ పోరాటానికి కూడా ఫలితం దక్కిందని అన్నారు.