Take a fresh look at your lifestyle.

ప్రజావాణికి అందిన 3,053 దరఖాస్తులు

ముద్ర, తెలంగాణ బ్యూరో : మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 3,053 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులలో ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చాయి. రేషన్ కార్డులు, పెన్షన్ల కోసం కూడా దరఖాస్తులు అందాయి.

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 111, విద్యుత్ శాఖకు సంబంధించి 100,  రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 55, ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 2,691 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 96 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్.చిన్నారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.