- పార్టీపై దిక్కారం స్వరం పెంచిన కవిత
- కేటీఆర్ పై పరోక్షంగా విమర్శల దాడి
- దానికి అడ్డుగా ఉన్నందువల్ల తనను దూరం పెడుతున్నారు
- పెయిడ్ ఆర్టిస్తుటలతో తిట్టిస్తున్నారు
- కోవర్టులు.. లేఖ లీక్ వీరులు ఎవరో తేలాలి
- కేసీఆర్ ను తప్ప.. మరెవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని స్పష్టీకరణ
ముద్ర, తెలంగాణ బ్యూరో: గులాబీ పార్టీలో కవిత పెట్టిన చిచ్చు పతాక స్థాయికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఇక ఏ నిమిషంలోనైనా అది విస్పోటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కవిత సైతం ఇక పార్టీతో తాడోపోడే తేల్చుకునేందుకు సిద్ధమైనట్లుగానే తెలుస్తోంది. పరోక్షంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూనే తన దారి తాను చూసుకుంటున్న వైనాన్ని వెల్లడించారు. మరోవైపు పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఇందుకు తాను అడ్డుగా ఉన్నందువల్లే తనను దూరం పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.పెయిడ్ ఆర్టిస్తులతో ఉద్దేశపూర్వకంగా తనను తిట్టిస్తున్నారని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి వాటికి భయపడే రకం తాను కాదని హెచ్చరించారు.పైగా తనను రెచ్చగొడితే మరింత రెచ్చిపోతానని అన్నారు.పార్టీలో కేసీఆర్ ను తప్ప మరెవరి నాయకత్వాన్ని అంగీకరించేది లేదని అన్నారు. తనకు ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
- కావాలనే దూరం పెడుతున్నారు.
- అందుకే జాగృతి నుంచి చేస్తున్నా.
- అదంతా ఉత్తుత్తిదే.
- ట్వీట్లు చేస్తే సరిపోతుందా?
- షోకాజ్ నోటీసులు?